Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

Published Tue, Jul 10 2018 8:02 AM

Three family members died in Road accident in Chittoor   - Sakshi

సాక్షి, చిత్తూరు : కురబల కోట రైల్వే స్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీలారీ(ఏపీ04 టీటీ6668)ని బైక్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. 

ఒకే కుటుంబానికి చెందిన చంద్రశేఖర్, దేవేంద్ర, దినేష్‌లు వెళ్తున్న ద్విచక్ర వాహనం, రోడ్డు పక్కనే ఆగిఉన్న మినీలారీలారీ వెనకవైపు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దేవేంద్రను బస్సు ఎక్కించేందుకు ఆయన తండ్రి చంద్రశేఖర్, తమ్ముని కొడుకు దినేష్లు వెళుతుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement
Advertisement